హోమ్ /వార్తలు /క్రీడలు /

WT20 Challenge : స్టార్ క్రికెటర్ లేకుండానే ఉమెన్స్ టీ20 చాలెంజ్ టోర్నీ.. జట్ల వివరాలను, తేదీలను ప్రకటించిన బీసీసీఐ

WT20 Challenge : స్టార్ క్రికెటర్ లేకుండానే ఉమెన్స్ టీ20 చాలెంజ్ టోర్నీ.. జట్ల వివరాలను, తేదీలను ప్రకటించిన బీసీసీఐ

మహిళల టి20 చాలెంజ్ టోర్నీ (ఫైల్ ఫోటో)

మహిళల టి20 చాలెంజ్ టోర్నీ (ఫైల్ ఫోటో)

WT20 Challenge : మహిళల విభాగంలో జరిగే టి20 చాలెంజ్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) సోమవారం విడుదల చేసింది. మే 23 నుంచి 28 మధ్య మూడు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. కోవిడ్ 19 వల్ల మ్యాచ్ లన్నీ కూడా పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

ఇంకా చదవండి ...

WT20 Challenge : మహిళల విభాగంలో జరిగే టి20 చాలెంజ్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) సోమవారం విడుదల చేసింది. మే 23 నుంచి 28 మధ్య మూడు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. కోవిడ్ 19 వల్ల మ్యాచ్ లన్నీ కూడా పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి. గతంలోలాగే టోర్నీలో మూడు జట్లు.. వెలాసిటీ (Velocity), ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers), సూపర్ నోవాస్ (Super Novas)జట్లు పాల్గొంటున్నాయి. అయితే గత మూడు సీజన్లలో వెలాసిటీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ఈసారి మాత్రం ఆడటం లేదు. ఆమె స్థానంలో దీప్తి శర్మ ను వెలాసిటీ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ట్రయిల్ బ్లేజర్స్ కు స్మృతి మంధాన, సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు సారథులుగా వ్యవహరించనున్నారు. గతంలో ట్రయిల్ బ్లేజర్స్ జట్టులో భాగంగా ఉన్న జులన్ గోస్వామి, శిఖా పాండేలు కూడా ఈ ఏడాది ఆడటం లేదు.

ఇది కూడా చదవండి : నువ్వు తోపు సామీ.. క్యాచ్ విషయంలో బట్లర్ సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా..

మే 23న జరిగే తొలి మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ తో సూపర్ నోవాస్ ఆడుతుంది. మే 24న వెలాసిటీతో సూపర్ నోవాస్, మే 26న ట్రయిల్ బ్లేజర్స్ తో వెలాసిటీ జట్లు ఆడతాయి. ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది.

ఒక్కో టీంలో 16 మంది ప్లేయర్స్

ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్స్ ఆడనున్నారు. ప్రతి జట్టులోనూ నలుగురు విదేశీ ప్లేయర్స్ ఆడనున్నారు. 2018లో ఆరంభమైన ఈ చాలెంజ్ టోర్నీ.. 2020 వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల 2021 సీజన్లో ఈ టోర్నీ జరగలేదు. ఇక వచ్చే ఏడాది నుంచి మహిళల విభాగంలో కూడా ఐపీఎల్ లాంటి టోర్నీని జరిపేందుకు బీసీసీఐ సిద్దమైంది కూడా.

2018, 2019 సీజన్లలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ చాంపియన్ గా నిలువగా.. 2020లో మంధాన నాయకత్వంలోని ట్రయిల్ బ్లేజర్స్ టైటిల్ నెగ్గింది.

జట్ల వివరాలు

సూపర్ నోవాస్ 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా, అలాన్ కింగ్, ఆయుశ్ సోని,  చందు, డాటిన్, హర్లీన్ డియోల్, మేఘ్నాసింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రయ పూనియా, రాశి, సున్ లూస్, మాన్సి జోషి.

ట్రయిల్ బ్లేజర్స్

మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, మ్యాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా ఘోష్, ఎస్ మేఘ్నా, సైకా ఇష్క్, సాల్మా ఖాటున్, షర్మిన్ అక్తర్, సోఫియా బ్రౌన్, సుజాత మాలిక్,  ఎస్ బీ పొకార్కర్

వెలాసిటీ

దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ్ రాణా, ఆర్తి, అయబోంగా కాక, నావ్ గిరే, కేతరిన్ గ్రాస్, కీర్తి జేమ్స్, లారా, మాయా, నట్టఖాన్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, షివ్లె షిండే, సిమ్రన్ బహదూర్, యస్తిక భాటియా, ప్రణవి చంద్ర

First published:

Tags: Bcci, IPL, IPL 2022, Mithali Raj, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు