అర్ధాంతరంగా అగిపోయిన ఐ పీఎల్-14 రెండో దశ మ్యాచ్లు తిరిగి నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐకి అడుగడుగున అడ్డకులు ఎదురవుతున్నాయి. టోర్నీ రోజులను పెంచడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను తగ్గించే ప్రయాత్నాలు చేస్తోంది బోర్డు. లీగ్ రోజులు పెరగడం ద్వారా అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీలో రోజులు పెంచడంపై ఐసీసీ విముఖత వ్యక్తం చేస్తోంది.
అక్టోబరు 10 దాటి టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సుముఖంగా లేదట.
భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ గత నెలలోనే ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచ్లను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వాహించాలని బీసీసీఐ ఉద్దేశం. ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్ళు టోర్నీలో పాల్గోనడానికి వివిధ క్రికెట్ బోర్డులతో మాట్లాడింది. అక్టోబరు 10న లోపే టోర్నీ నిర్వహించాలని ఐసీసీ.. బీసీసీఐకి పరోక్షంగా సూచిచింది. ఐసీసీ టోర్నీ నిర్వహణపై అభ్యతరం చేప్పడానికి కారణం. అక్టోబరు 18న టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుంది. అప్పుడు అక్టోబరు 15 వరకు టోర్నీని కొనసాగించడం సాధ్యం కాదు. విదేశీ క్రికెట్ బోర్డ్స్ కూడా వారి ఆటగాళ్లను అక్టోబరు 15 వరకు ఐపీఎల్ ఆడేందుకు ఒప్పుకోవు.. దీంతో మలి దశ ఐపీఎల్ నిర్వహాణపై గందరగోళం మెుదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.