టెర్రర్ అలర్ట్.. టీమిండియాకు ఇంటలిజెన్స్ హెచ్చరిక..
IND Vs SA 1st test : విశాఖ తీరంలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. కోస్ట్గార్డ్,నేవీలతో మెరైన పోలీసులు సముద్రం నుంచి వచ్చే నౌకలు,బోట్లపై నిఘా పెట్టారు.
news18-telugu
Updated: October 6, 2019, 1:11 PM IST

టీమిండియా
- News18 Telugu
- Last Updated: October 6, 2019, 1:11 PM IST
ఉగ్రవాదులు క్రికెటర్లను టార్గెట్ చేయవచ్చునన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియా,దక్షిణాఫ్రికా క్రికెటర్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.విశాఖలో క్రికెటర్లు బస చేస్తున్న హోటల్.. అలాగే మైదానం వద్ద భద్రతను పెంచారు. విశాఖ తీరంలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. కోస్ట్గార్డ్,నేవీలతో మెరైన పోలీసులు సముద్రం నుంచి వచ్చే నౌకలు,బోట్లపై నిఘా పెట్టారు.ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. జడేజా 4 వికెట్లు, షమీ 3 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 149/8 ఉంది.దక్షిణాఫ్రికా విజయానికి 246 పరుగులు కావాలి. చేతిలో రెండు వికెట్లతో దక్షిణాఫ్రికా టార్గెట్ను చేధించడం కష్టమనే చెప్పాలి. దీంతో టీమిండియా విజయం దాదాపుగా ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది.
రోహిత్ శర్మపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
IND vs SA: కష్టాల్లో దక్షిణాఫ్రికా.. పట్టు బిగిస్తున్న టీమిండియా..
IND vs SA: మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ.. ఇండియా స్కోరు ఎంతంటే..
IND vs SA: ఓపెనర్ల వీర విహారం.. కొత్త రికార్డు దిశగా..
IND vs SA: రోహిత్ శర్మ సెంచరీ.. సిక్సుల మీద సిక్సులు బాదుతూ..
Loading...