టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత కుస్తీవీరులు (Indian Wrestler) అదరగొట్టారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో (Quarter Finals) భారత రెజ్లర్లు శుభారంభం చేశారు. పురుషుల విభాగంలో రవి దహియా (Ravi Dahiya), దీపక్ పునియా (Deepak Punia) విజయాలు సాధించగా.. మహిళల విభాగంలో అన్షు మాలిక్ (Anshu Malik) నిరాశ పరిచినా.. మరో ఛాన్స్ ఉన్నది. రవి దహియా క్వార్టర్ ఫైనల్లో జార్జి వలెటినోవ్ను 14-4 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరాడు. ఇక దీపక్ పునియా చైనాకు చెందిన లిన్ జుషెన్పై 6-3 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరాడు. ఇక అన్షు మాలిక్ తొలి రౌండ్లో ఇర్యానా కురచికినాపై ఓడిపోయింది. అయితే ఇర్యానా కురచికినా సెమీస్ చేరడంతో రిపిచేజ్ రూల్ కారణంగా మూడో స్థానం కోసం పోరాడే అవకాశం వచ్చింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.