హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: రెజ్లింగ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భజరంగ్ పునియా.. మరో పతకంపై పెరుగుతున్న ఆశలు

Tokyo Olympics: రెజ్లింగ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భజరంగ్ పునియా.. మరో పతకంపై పెరుగుతున్న ఆశలు

రెజ్లింగ్‌లోక్వార్టర్ ఫైనల్ చేరిన భజరంగ్ పునియా (SAI Media)

రెజ్లింగ్‌లోక్వార్టర్ ఫైనల్ చేరిన భజరంగ్ పునియా (SAI Media)

భారత రెజ్లర్ భజరంగ్ పునియా టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో అతడు ఇరాన్‌కు చెందిన రెజ్లర్‌తో తలపడనున్నాడు.

భారత రెజ్లర్ భజరంగ్ పునియా(Bajrang Punia) టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. శుక్రవారం ఉదయం 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కిర్గిస్తాన్‌కు చెందిన ఎర్నజర్ అక్మటాలెవ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో పునియా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో తప్పక పతకం తెస్తాడని భజరంగ్ పునియాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చాంపియన్ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్‌లో భజరంగ్ ముందే పాయింట్ సాధించాడు. ఏకంగా 3-1 ఆధిక్యంతో దూసుకొని వెళ్లాడు. ఆ తర్వాత రౌండ్లో కిర్గిస్తాన్ రెజ్లర్ గట్టి పోరాటం చేశాడు. ఒక్కో పాయింట్ సాధిస్తూ చివరకు 3-3తో స్కోర్ సమం చేశాడు. అయితే రిఫరీలు పునియాను విజేతగా ప్రకటించాడు. స్కోరింగ్ మూవ్స్ ఎక్కువగా పునియా చేయడంతో అతడిని విజయం వరించింది. కిర్గిస్తాన్ రెజ్లర్ స్కోరింగ్ మూవ్స్ కంటే పునియాను రింగ్ నుంచి బయటకు నెట్టేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో రిఫరీలు పునియానే విజేతగా ప్రకటించారు.


ఇక క్వార్టర్ ఫైనల్‌లో పునియా ఇరాన్‌కు చెందిన రెజ్లర్‌తో తలపడనున్నాడు.

First published:

Tags: Olympics, Tokyo Olympics, Wrestling

ఉత్తమ కథలు