టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) మరో భారత అథ్లెట్ ఫైనల్కు అర్హత సాధించాడు. బుధవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో (Javelin Throw) పురుషుల గ్రూప్-ఏ క్వాలిఫై రౌండ్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఫైనల్కు (Final) అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్కు చేరాడు. ఈ సీజన్లో అత్యధిక దూరం విసిరిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాట తర్వాత స్థానంలో నీరజ్ చోప్రా ఉండటం గమనార్హం. జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు ఈ నెల 7న జరుగనున్నాయి. డిస్కస్ త్రో మహిళల విభాగంలో కూడా కమల్ప్రీత్ ఫైనల్కు చేరుకుంది. కానీ అక్కడ పతకానికి సరిపడా విసరలేకపోయింది.
A great start for 🇮🇳's star athlete @Neeraj_chopra1 as he Qualifies for the Final of the Men's Javelin throw event with his 1st attempt of 8⃣6⃣.6⃣5⃣m
మరోవైపు జావెలిన్ త్రోలో భారత్ తరపున పాల్గొన్న మరో అథ్లెట్ శివ్పాల్ సింగ్ పేలవ ప్రదర్శన చేశాడు. గ్రూప్-బి క్వాలిఫై రౌండ్లో అతను 76.40 మీట్లు విసిరి 12వ స్థానంలో నిలిచాడు. దీంతో అతడు ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.