హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక...సిరీస్ కోసం కోహ్లీ సేన తహ తహ

India vs Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక...సిరీస్ కోసం కోహ్లీ సేన తహ తహ

కోహ్లీ, మలింగ (File)

కోహ్లీ, మలింగ (File)

రెండో టీ-20లో భారత్ విజయం సాధించగా. మూడో టీ-20లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. మరోవైపు మూడో మ్యాచులో సత్తా చాటి శ్రీలంక సిరీస్‌ను సమానం చేయాలనుకుంటోంది.

పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే చివరి టీ-20 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో టీ-20లో భారత్ విజయం సాధించగా. మూడో టీ-20లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. మరోవైపు మూడో మ్యాచులో సత్తా చాటి శ్రీలంక సిరీస్‌ను సమానం చేయాలనుకుంటోంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు కీలక మార్పులు చేసింది. శివమ్ దూబే, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో మనీశ్ పాండే, సంజూ శాంసన్, యుజవేంద్ర చాహల్‌లు జట్టులోకి వచ్చారు. ఇక శ్రీలంక తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మ్యాథ్యూస్, లక్షన్ సందకన్‌లకు జట్టులో చోటు కల్పించింది.

భారత్: కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీష్ పాండే, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: ధనుష్క గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, కుసల్ పెరెరా, ఓషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, దాసున్ షానకా, లక్షన్ సందకన్, వనిందు హసరంగ, లసిత్ మలింగ (కెప్టెన్), లాహిరు కుమారా

First published:

Tags: India vs srilanka, Lasith Malinga, Virat kohli

ఉత్తమ కథలు