హామిల్డన్ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కివీస్ ఓపెనర్లు చెలరేగి ఆడడంతో... మొదటి 7.4 ఓవర్లలోనే 80 పరుగులు రాబట్టింది కివీస్ జట్టు. ఈ దశలో సీఫర్ట్ను స్టంప్ అవుట్ చేసిన ధోనీ... భారత్కు తొలి బ్రేక్ అందించాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 25 బంతుల్లోనే 43 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్... కుల్దీప్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయి ధోనీకి వికెట్ల దగ్గర దొరికేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియంసన్తో కలిసి మున్రో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. మున్రోను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా... 21 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన కివీస్ కెప్టెన్ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు.
భారత మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 300వ టీ20 మ్యాచ్... ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ధోనియే కావడం విశేషం...
అప్పటికే 14.4 ఓవర్లలో జట్టు స్కోరు 150 పరుగుల మార్కు దాటడం విశేషం. ఆ తర్వాత మిచెట్, గ్రాండ్హోమ్ కలిసి భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేసిన గ్రాండ్హోమ్, భువనేశ్వర్ బౌలింగ్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిచెల్ 19, రాస్ టేలర్ 14 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది కివీస్. కుల్దీప్ యాదవ్కు రెండు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ యాదవ్, ఖలీల్ అహ్మద్కు చెరో వికెట్ దక్కాయి.
ఇప్పటిదాకా కివీస్తో భారత్ టీ20 సిరీస్ గెలిచింది లేదు. మొత్తంగా 9 సార్లు ఇరుజట్లు పోటీ పడగా... ఏడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. రెండో టీ20 మ్యాచ్తో కలిపి రెండు సార్లు మాత్రమే టీమిండియాకు సక్సెస్ సొంతమైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.