వెల్టింటన్ టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి, ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్కు షాక్ ఇచ్చేలా... కివీస్ ఓపెనర్లు చెలరేగిపోయారు. రెండో ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్తో మున్రో కూడా వేగంగా పరుగులు సాధించడంతో 8.2 ఓవర్లలోనే 86 పరుగులు దాటింది. ఈ దిశలో మున్రోను అవుట్ చేసిన క్రునాల్ పాండ్యాకు టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్సన్తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు.
దినేశ్ కార్తీక్ ఓ సులువైన క్యాచ్ జారవిడచడంతో బతికిపోయిన సిఫర్ట్... 42 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత బౌండరీ దగ్గర అద్భుత క్యాచ్తో మిచెల్ను అవుట్ చేశాడు దినేశ్ కార్తీక్. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ 22 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత రాస్ టేలర్ బౌండరీలతో చెలరేగాడు. రాస్ టేలర్ చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్ను బౌండరీ దగ్గర కార్తీక్ జారవిడిచాడు. గ్రాండ్హోమ్ భారీ షాట్కు ప్రయత్నించి సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లో రాస్ టేలర్ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్కా్ట్ 7 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 20 పరుగులు చేసి... భారీ స్కోరుకి బాటలు వేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కివీస్...219 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కగా, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, కునాల్ పాండ్యా, చాహాల్లకు చెరో వికెట్ దక్కాయి.
2016లో వెస్టిండీస్తో మ్యాచ్ తర్వాత టీమిండియా 200+ స్కోరు సాధించడం ఇదే ప్రథమం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.