news18-telugu
Updated: June 30, 2019, 4:59 PM IST
తొలి వికెట్ సాధించిన ఆనందంలో టీమిండియా...
India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. 26 ఓవర్లు ముగిసే నాటికి ఇంగ్లాండ్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు సాధించింది. తొలి వికెట్ రూపంలో జేసన్ రాయ్ (66) రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టుకొని ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే తొలి వికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ ఏకంగా 160 పరుగులు జోడించింది. మరోవైపు ఓపెనర్ బెయిర్ స్టో సైతం సెంచరీ సాధించడం విశేషం. ప్రస్తుతం క్రీజులో జోరూట్, బెయిర్ స్టోలు ఆడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు భారత్ బౌలర్లు సైతం వికెట్ల వేటలో ఉన్నారు.
కాగా ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. ఒక వేళ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోతే సెమీస్ ఆశలపై నీళ్లు జల్లినట్లే...
Published by:
Krishna Adithya
First published:
June 30, 2019, 4:59 PM IST