హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : వైజాగ్ లో దంచి కొట్టిన రుతురాజ్, ఇషాన్.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన టీమిండియా

IND vs SA : వైజాగ్ లో దంచి కొట్టిన రుతురాజ్, ఇషాన్.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన టీమిండియా

రుతురాజ్, ఇషాన్ కిషన్ (PC : BCCI)

రుతురాజ్, ఇషాన్ కిషన్ (PC : BCCI)

IND vs SA : వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న మూడో టి20లో భారత (India) ఓపెనర్లు దంచి కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు.

ఇంకా చదవండి ...

IND vs SA : వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న మూడో టి20లో భారత (India) ఓపెనర్లు దంచి కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. టాస్ ముందు వరకు కూడా తుది జట్టులో ఉంటాడో లేదో తెలియని స్థితిలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) నమ్మకముంచడంతో రుతురాజ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. దిగడమే కాదు తనపై ద్రవిడ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వీరితో పాటు చివర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా ఓ మోస్తరుగా ఆడటంతో.. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీశాడు.

ఓపెనర్లు మినహా

కెప్టెన్ గా రిషభ్ పంత్ వరుసగా మూడోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన బవుమా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్, ఇషాన్ కిషన్ ఆరభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అద్బుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా సత్తా చాటడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లేలో 57 పరుగులు సాధించిన టీ మిండియా.. 10 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. 10వ ఓవర్ ఆఖరి బంతికి రుతురాజ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (14) రెండు సిక్సర్లు బాదిన తర్వాత పెవిలియన్ కు చేరగా.. వెంట వెంటనే ఇషాన్ కిషన్, పంత్ (6) పెవిలియన్ కు చేరాడు. దాంతో పరుగులు రావడం చాలా కష్టంగా మారింది. దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీలు సాధించడంతో మెరుగైన స్కోరును సాధించగలిగింది. ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్ 200 మార్కును చేరుకుంటుందని అంతా అనుకున్నా దానికి 21 పరుగుల దూరంలోనే భారత్ ఆగిపోయింది.

టీమిండియా తుది జట్టు

రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజువేంద్ర చహల్

దక్షిణాఫ్రికా తుది జట్టు

క్లాసెన్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డుస్సెన్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జె, తబ్రేజ్ షంసీ.

First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India

ఉత్తమ కథలు