IND vs NZ 3rd ODI : న్యూజిలాండ్ (New Zealand)తో జరిగే కీలకమైన మూడో వన్డేకు భారత్ (India) సిద్ధమైంది. నవంబర్ 30న క్రైస్ట్ చర్చ్ వేదికగా మూడో వన్డే జరగనుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. అనంతరం జరిగిన రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది. దాంతో వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకునే అవకాశం లేదు. మూడో వన్డేలో భారత్ నెగ్గితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. లేదంటే సిరీస్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో మూడో వన్డే భారత్ కు డూఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్ కూడా తొలి రెండు వన్డేల్లాగే భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. మ్యాచ్ ను అమెజాన్ ప్రైమ్ తో పాటు డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి.
మరోసారి సంజూ బెంచ్ కే
సంజూ సామ్సన్ మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. టి20, వన్డే సిరీస్ లకు అందుబాటులో ఉన్నా సంజూ సామ్సన్ కు ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. కివీస్ తో జరిగిన తొలి వన్డేలో ఆడిన సామ్సన్ 36 పరుగులు చేశాడు. కష్ట సమయంలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఐదో వికెట్ కు 94 పరుగులు జోడించాడు. ప్రస్తుతం సంజూ సామ్సన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా రెండో వన్డే నుంచి సామ్సన్ ను టీమ్ మేనేజ్ మెంట్ తప్పించింది. అతడి స్థానంలో ఎక్స్ ట్రా బౌలింగ్ ఆప్షన్ పేరుతో దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. ఫామ్ లో లేని పంత్ ను తప్పించి దీపక్ హుడాను తీసుకోవాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక మూడో వన్డేలో సంజూ సామ్సన్ తో పాటు శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ లు బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దాంతో ఫామ్ లో లేకపోయినా మరోసారి పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
టీమిండియా తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, Kane Williamson, Rishabh Pant, Sanju Samson, Shikhar Dhawan, Team India