Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: June 21, 2019, 3:45 PM IST
వోక్స్ (ట్విట్టర్ ఫోటో)
ప్రపంచకప్లో భాగంగా ఈ రోజు లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందని లంక కెప్టెన్ కరుణ రత్నే బ్యాటింగ్కు మొగ్గు చూపాడు. ఇంగ్లండ్ జట్టు ఏ మార్పూ లేకుండా బరిలోకి దిగగా, లంక రెండు మార్పులు చేసింది. జీవన్ మెండిస్, ఫెర్నాండోను తుది జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్లాడిన లంక ఒకదాంట్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కాగా, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ కరుణరత్నే(1), వికెట్ కీపర్ కుశాల్ పెరీరా(2) వెంటవెంటనే అవుట్ అయ్యారు. క్రిస్ వోక్స్, ఆర్చర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 9 ఓవర్లకు 37/2 గా ఉంది. క్రీజులో ఫెర్నాండో(31), కుశాల్ మెండిస్(3) ఉన్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
June 21, 2019, 3:40 PM IST