news18-telugu
Updated: December 2, 2020, 5:36 PM IST
హార్థిక పాండ్య- రవీంద్ర జడేజా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా అని చెప్పొచ్చు. 152 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ టీమిండియా ఒక దశలో 250 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆరో వికెట్కు పాండ్యా, జడేజాలు కలిసి ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచిందనడంలో సందేహం లేదు. వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా జట్టుపై 6వ వికెట్కు 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించారు. 1999లో ఇదే ఆసీస్పై రాబిన్ సింగ్, శఠగోపన్ రమేశ్లు 6వ వికెట్కు 123 పరుగుల జోడించడం ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. అయితే, ఆ రికార్డును 21 ఏళ్ల తర్వాత పాండ్యా, జడేజాలు కలిసి సవరించారు.
ఓవరాల్గా చూసుకుంటే పాండ్యా, జడేజా జోడి ఆసీస్పై చేసిన 150 పరుగుల భాగస్వామ్యంతో మూడవ స్థానంలో ఉండగా... అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ కలిసి 2015లో జింబ్వాబేతో జరిగిన వన్డేలో 6 వికెట్కు 160 పరుగులు జోడించి మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ధోని, యువరాజ్ జోడి నిలిచింది. వీరిద్దరు కలిసి 2005లో జింబ్వాబేపై 6వ వికెట్కు 158 పరుగుల జోడించారు.

హార్దిక్ పాండ్యా (Image:BCCI)
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా మరో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 76 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్తో 92 పరుగులు చేశాడు. పాండ్యాకు వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఆఖర్లో జడేజాకు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. మరోవైపు 32 ఓవర్లో ప్యాండ్యాకు జత కలిసిన జడేజా కూడా యదేచ్చగా బ్యాట్ ఝులింపించాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు పిండుకున్నాడు. ఆ
తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 289 పరుగులకే ఆలౌట్ అయింది. 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది కోహ్లీ సేన. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. బుమ్రా, నటరాజన్ కూడా చెరో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఈ విజయంతో వైట్ వాష్ కాకుండా టీమిండియా పరువు దక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలిచింది.
Published by:
Sridhar Reddy
First published:
December 2, 2020, 5:22 PM IST