దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షాద్నగర్ హత్యాచార ఘటనపై క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్లో స్పందించాడు. 'ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే.. వారి మెడ చుట్టూ ఉరి బిగుసుకుంటుందన్న ఊహ కలగాలి. ఘటన గురించి ఎక్కువ ఆలోచించవద్దు. చేయాల్సిన పని
చేసేయాల్సిందే. రేపిస్టులను ఉరితీయండి.' అంటూ వ్యాఖ్యానించారు. అంబటి రాయుడు ట్వీట్కి నెటిజెన్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. నిందితులను ఉరితీయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా,అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా షాద్ నగర్ ఘటనపై ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని, సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని వాపోయాడు.
Anyone who thinks of violating a woman's body should imagine the noose tightening around their neck.lets not think too much.its high time that we act. Hang the rapists..
— Ambati Rayudu (@RayuduAmbati) December 1, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rayudu, Hyderabad, Priyanka reddy murder, Shadnagar