టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వివాదం నడుస్తోందని గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పొసగడం లేదని వరల్డ్ కప్ నుంచి సెమీ ఫైనల్లోనే భారత్ ఇంటి ముఖం పట్టిన అనంతరం వార్తలొచ్చాయి. భారత్ ఇంటిముఖం పట్టడానికి ఇదీ ఓ కారణమని ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యే విరాట్ కోహ్లీని, అతని భార్య అనుష్క శర్మను ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాల్ చేయడం కూడా ఊహాగానాలను మరింత పెంచింది. అయితే, వీరిద్దరి మధ్య వివాదం వాస్తవమేనని, దీన్ని సద్దుమణిగేలా చేసేందుకు బీసీసీఐ రంగంలోకి దిగిందని మరో వార్త వినిపిస్తోంది. ఓ బీసీసీఐ సీనియర్ అధికారి వీరిద్దరితో చర్చించనున్నట్లు తాజా సమాచారం.
బీసీసీఐ సీఈవో రాహుల్ జోషి తానే స్వయంగా అమెరికా వెళ్లి కోహ్లీ, రోహిత్తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలో టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి భాగం అవుతారని సమాచారం. కాగా, వెస్టిండీస్తో రెండు టీ-20 మ్యాచ్లను భారత్.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Bcci, Cricket, Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019, Rohit sharma, Team india, Virat kohli