హోమ్ /వార్తలు /క్రీడలు /

పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం తీపికబురు...

పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం తీపికబురు...

పీవీ సింధు (File)

పీవీ సింధు (File)

పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు కేటాయిస్తామని టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు కేటాయిస్తామని టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు త్వరలో 4 క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ప్రతిభ గా పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, గత ఏడాది 3 కోట్లు పేద క్రీడాకారులు కు అందించామని చెప్పారు. ఈ ఏడాది కూడా 3 కోట్లు సీఎం కేటాయించారన్నారు. త్వరలోనే జిమ్ లను రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో టూరిజం హోటళ్ల ను తెరుస్తున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి అన్ని చోట్లా బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక ప్రాంతదేశాలన్ని మళ్ళీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామని ప్రకటించారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. టెంపుల్ టూరిజం ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రసాద్ స్కీం ద్వారా సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేస్తామని, శ్రీశైలం లో 50 కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని అవంతి చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Avanthi srinivas, Pv sindhu

ఉత్తమ కథలు