ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో ఈ మేరకు జగన్ స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత వారం పది రోజుల్లో కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పారు. ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించిన భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈనెల 29న సాయంత్రమే కేసీఆర్ విజయవాడ చేరుకుంటారు.
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.