సహజ నటి జయసుధ .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నటనతో, అభినయంతో అందర్నీ కట్టేపడేస్తారు. పాత సినిమాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్గా కూడా నటించారు. ఆ తర్వాత ప్రస్తుత సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా లీడ్ రోల్స్లో మెరుస్తున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు జయసుధ. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈమె.. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె చేరారు. అతడికే తమ మద్దతు తెలిపారు. కొడుకుతో సహా వెళ్లి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జయసుధ.
తాజాగా జయసుధ సింగర్గా మారారు. జయసుధ ఎప్పుడో క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ సంచలనాల డైరెక్టర్ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.