YANAMALA RAMAKRISHNUDU SATIRICAL COMMENTS ON CM JAGAN BS
కోర్టులకు డుమ్మా కొట్టేందుకే.. సీఎం జగన్పై మాజీ మంత్రి సెటైర్లు..
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
కోర్టులకు డుమ్మా కొట్టేందుకే సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, దాన్నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో కేసులను పరిష్కరించుకోవాలనుకున్నారని అన్నారు.
కోర్టులకు డుమ్మా కొట్టేందుకే సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, దాన్నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో కేసులను పరిష్కరించుకోవాలనుకున్నారని అన్నారు. అయితే, హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా సొంత కేసులు, డిశ్చార్జి పిటిషన్లు, కోర్జు హాజరు నుంచి మినహాయింపుల గురించే అడుగుతున్నారని ఆరోపించారు. అటు.. ఫెమా, మనీలాండరింగ్పై సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందుకే.. గత మూడు శుక్రవారాలుగా ఏదో ఒక వంకతో కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారని విమర్శించారు. కేసుల్లో విచారణ వేగవంతం కావడం, శిక్షపడే అవకాశాలున్నాయన్న భయం జగన్కు పట్టుకుందని మాజీ మంత్రి అన్నారు. త్వరలో జరిగే సమావేశాల్లో వైసీపీ వైఫల్యాలను ఎండగడతామని యనమల ఉద్ఘాటించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.