news18-telugu
Updated: July 2, 2020, 11:38 AM IST
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీలకు ఏపీ సీఎం జగన్ మూడు ప్రాంతాల బాధ్యతలు అప్పగించడంపై టీడీపీ సీనియర్ నేత యనమల విమర్శలు గుప్పించారు. ఈ ముగ్గురితో కలిపి సీఎం జగన్ కిచెన్ కేబినెట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీఎం ఏర్పాటు చేసిన కిచెన్ కేబినెట్తో రాష్ట్ర కేబినెట్ రబ్బర్ స్టాంప్ చేశారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీలకు బాధ్యతలు అప్పగించడమే ఉదాహరణ అని ఆరోపించారు. తోలుబొమ్మ మంత్రులతో అందరినీ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారని యనమల అన్నారు. ఏపీలో కిచెన్ కేబినెట్ ఏం చెబితే... రాష్ట్ర కేబినెట్ అది చేస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామ వాలంటీర్ల నుంచి కిచెన్ కేబినెట్కు సంబంధాలు నెలకొల్పారని వ్యాఖ్యానించారు. 600 నామినేటెడ్ పోస్టుల్లో మెజార్టీ ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టారని విమర్శించారు. బడుగు వర్గాలను ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తారని యనమల అన్నారు.
First published:
July 2, 2020, 11:38 AM IST