హోమ్ /వార్తలు /politics /

సన్మానిస్తారనుకుంటే.. జగన్ ఇలా చేశారేంటి... కేశినేని నాని సెటైర్

సన్మానిస్తారనుకుంటే.. జగన్ ఇలా చేశారేంటి... కేశినేని నాని సెటైర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన కేశినేని నాని ట్వీట్ చేశారు. ‘మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని (ఏబీ వెంకటేశ్వరరావు) సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

    1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఏప్రిల్‌లో జరిగి నఅసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మీద వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను బదిలీ చేసింది. తాజాగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో సస్పెండ్ చేసింది.

    ప్రభుత్వ ఉత్తర్వులు

    వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు ప్రభుత్వం చెప్పిన కారణాలు..

    • నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు
    • ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు
    • ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ
    • విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్న ప్రభుత్వం
    • విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
    • నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
    • రాష్ఠ్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ
    • కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ
    • కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ
    • విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ
    • ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ
    • నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ
    • ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఆరోపణ
    • కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణ
    • వెంకటేశ్వరరావు కుమారుడికి చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇజ్రాయెల్ కంపెనీతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది.

    జగన్ సర్కార్‌తో ఢీ.... సస్పెన్షన్‌పై స్పందించిన ఏబీ వెంకటేశ్వర్రావు, ex intelligence chief ab venkateshwar rao serious respond on his suspension
    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

    ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.  అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తాన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు.దీనిపై ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.

    First published:

    ఉత్తమ కథలు