హోమ్ /వార్తలు /రాజకీయం /

టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్‌రెడ్డి...హరీష్‌రావు లేకుండానే... కేసీఆర్ వ్యూహాం ఇదే ?

టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్‌రెడ్డి...హరీష్‌రావు లేకుండానే... కేసీఆర్ వ్యూహాం ఇదే ?

వంటేరు ప్రతాప్ రెడ్డి(facebook image)

వంటేరు ప్రతాప్ రెడ్డి(facebook image)

గజ్వేల్‌లో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

    తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పందించేందుకు వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆయన కుమారుడు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యనేతలతో పార్టీ మార్పుపై వంటేరు ప్రతాప్ రెడ్డి చర్చలు జరిపారని... అవి ఫలించడంతో ఆయన కారెక్కేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


    telangana assembly, telangana news, telangana election, telangana assembly speaker, telangana assembly seats, telangana assembly building, telangana assembly election, kcr speech, తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
    సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)


    కేసీఆర్ వ్యూహం ఇదే ?

    మరోవైపు గజ్వేల్‌లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన వంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహాం వేరే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్... ఆ తరువాత గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలనే దానిపై తీవ్రంగానే సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్ మినహా ఎవరు పోటీ చేసినా వంటేరు ప్రతాప్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమవుతుందనే అంచనాకు వచ్చిన గులాబీ బాస్... వంటేరును టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి ఆ తరువాత గజ్వేల్ ఎమ్మెల్యే బరిలో నిలపవచ్చని యోచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్న కేసీఆర్... గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలో ఉంచితే...ఆ సీటు మళ్లీ టీఆర్ఎస్ ఖాతాలోనే ఉంటుందని ఆలోచిస్తున్నట్టు బలంగా నమ్ముతున్నారు.


    Harish rao skip campaign… Defeat for TRS after assembly elections ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌కు తొలి ఓటమి... పట్టించుకోని హరీష్‌రావు సంగారెడ్డి జిల్లాలోని ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టిఎంఎస్ ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు ఈ ఎన్నికలపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్లే ఇక్కడ టిఎంస్ ఓడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
    హరీశ్ రావు (ఫైల్ ఫోటో)


    హరీష్‌రావు రాయబారం లేకుండానే ?

    సాధారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టీఆర్ఎస్‌లో ఎలాంటి చేరికలు ఉన్నా... అందులో మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాత్ర కచ్చితంగా ఉంటుంది. అయితే తాజాగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం వెనుక రాయబారం ఎవరది అనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. కొందరు వంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కడం వెనుక కూడా హరీష్ రావు పాత్ర ఉండొచ్చని అంటుంటే... ఈ మధ్యకాలంలో హరీష్ రావు అలాంటి ప్రయత్నాలు చేయలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపారనే టాక్ కూడా వినిపిస్తోంది.


    First published:

    Tags: CM KCR, Gajwel, Harish Rao, Telangana, Trs

    ఉత్తమ కథలు