ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నికై నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. బుధవారం సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖను అందించారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజూర్నగర్లో ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే అక్కడ ఎన్నిక జరగనుంది.
డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు టీపీీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై 6వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అనంతరం ఐదు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దింపాలని నిర్ణయించిన హైకమాండ్ నల్గొండ ఎంపీ స్థానానికి ఉత్తమ్ని బరిలోకి దింపింది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిని ఓడించి ఎంపీగా గెటిచారు ఉత్తమ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana, Trs, TS Congress, Uttam Kumar Reddy