నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎం 3 ఈవీఎంలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులకు పోలింగ్ జరిపే అవకాశం ఉన్నందునా.. ఈ మెషిన్లతోనే పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది.కాగా, నిజామాబాద్ లోక్సభ బరిలో పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 186కి చేరడంతో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే ఎం 3 ఈవీఎంలతో ఎక్కువ మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉండటంతో.. ఈసీ వీటి వైపే మొగ్గుచూపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs