news18-telugu
Updated: September 1, 2019, 4:58 PM IST
గవర్నర్ నరసింహన్తో కేసీఆర్(ఫైల్ ఫోటో)
తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తెలంగాణకు కేంద్ర కొత్త గవర్నర్ని ప్రకటించిన నేపథ్యంలో రాజ్భవన్లో ప్రస్తుత గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించినందుకు నరసింహన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. కాగా, నరసింహన్ సుదీర్ఘ కాలంగా గవర్నర్గా పనిచేస్తున్నారు. 9 ఏళ్ల 9 నెలలుగా ఆయన గవర్నర్ పదవిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలపై పట్టునున్న వ్యక్తిగా నరసింహన్కు గుర్తింపు ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఈఎస్ఎల్ నరసింహన్ను కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన్ను నియమించే అశకాశముంది. గవర్నర్ పదవికి ఆయన రాజీనమా చేసిన తర్వాత సలహాదారుగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే రిటైర్డ్ సీఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా కేసీఆర్ నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో నరసింహన్ను కూడా ప్రభుత్వ సలహదారుగా నియమిస్తారని తెలుస్తోంది.
ఇక తెలంగాణకు కొత్త గవర్నర్ని నియమించింది కేంద్రం. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ను తెలంగాణ గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో రాష్ట్ర గవర్నర్గా త్వరలోనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
September 1, 2019, 4:54 PM IST