news18-telugu
Updated: January 22, 2020, 10:47 AM IST
అమరావతిలో హైఅలర్ట్... తేడా వస్తే అరెస్టులే...
గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బంద్ నేపథ్యంలో రోడ్డుపై టీడీపీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాాబాహీకి దిగాయి. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. డీఎస్పీ సీతరామయ్య కాలర్ను పోలీసులు పట్టుకోవడంతో... పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరోవైపు అసలు బంద్కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
అమరావతి JAC తలపెట్టిన బంద్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. గుంటూరు రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు బంద్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు. ఎవరూ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని పోలీసులు ప్రకటించారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 22, 2020, 8:44 AM IST