news18-telugu
Updated: November 15, 2020, 8:34 PM IST
అహ్మద్ పటేల్
మన దేశంలో కరోనా ప్రభావం తగ్గుతోంది. కొత్త కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఐతే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. గత నెలలో కరోనా బారినపడిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు.
అహ్మద్ పటేల్కు అక్టోబరు 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయంది. నెల రోజులుగా గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుంటున్నారని అనుకుంటున్న వేళ.. ఆదివారం ఆరోగ్యం విషమించింది. ఈ క్రమంలోనే ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని.. మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయన కరోనాను జయించి.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా, భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,100 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 88,14,579కి చేరింది. అంతేకాదు... నిన్న 447 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,29,635కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న 42,156 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 82,05,728కి చేరింది. రికవరీ రేటు మరింత పెరిగి... 93.1 శాతానికి చేరింది. ఇండియాలో ప్రస్తుతం 4,79,216 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 8,05,589 టెస్టులు మాత్రమే జరిగాయి. మొన్నటి కంటే అవి 1,23,902 తక్కువగా ఉన్నాయి. మొత్తం టెస్టుల సంఖ్య 88,14,579కి చేరింది
Published by:
Shiva Kumar Addula
First published:
November 15, 2020, 8:29 PM IST