హోమ్ /వార్తలు /politics /

YS Jagan Bail Issue: సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. రఘురామ పిటిషన్ కొట్టివేత

YS Jagan Bail Issue: సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. రఘురామ పిటిషన్ కొట్టివేత

ఎంపీ రఘరామ కృష్ణంరాజు, సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఎంపీ రఘరామ కృష్ణంరాజు, సీఎం జగన్(ఫైల్ ఫొటో)

సీబీఐ కోర్టు(CBI Court)లో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కు ఊరట దక్కింది. బెయిల్ రద్దు చేయాలన్న అంశంలో రఘురామ కృష్ణంరాజుకు షాక్ తగిలింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సీబీఐ కోర్టులో (CBI Court) ఊరట లభించింది. జగన్ తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ( Raghu Rama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ (Hyderabad) లోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన జగన్, విజయసాయి ప్రస్తుతం సీఎం, ఎంపీ పదవుల్లో ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని.. అందువల్ల ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా బెయిల్ జగన్, విజయసాయి బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రఘురామ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

ఇది చదవండి: ఢిల్లీలో దిశ యాప్ రక్షణ... తెలుగు యువతిని కాపాడిన ఆంధ్రా పోలీసులు...


మరోవైపు బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలిచ్చింది. విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించింది. ఈ మేరకు రఘురామ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ ర‌ఘురామ కోర‌గా కోర్టు తిర‌స్క‌రించింది. పిటిష‌న్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. సహేతుకమైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సాక్షి మీడియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాత్రం హైకోర్టు బదిలీ చేసింది.

ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు... జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. మధ్యలో జగన్ బెయిల్ రద్దు కాబోతోందని రాష్ట్రానికి మరో సీఎం రాబోతున్నారన్న పుకార్లు షికార్లు కూడా చేశాయి. దీనిపై రఘురామతో పాటు ప్రతిపక్షాలు కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేశాయి.

ఇది చదవండి: వీడెక్కడి మొగుడండీ.., బలిచ్చేందుకు పిల్లల్ని కనాలంట... భార్యతో క్షుద్రపూజలు


ఐతే అందరి అంచనాలు, విశ్లేషణలను పటాపంచలు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. రఘురామకు షాకిస్తూ.. జగన్, విజయసాయికి ఊరటనిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బెయిల్ రద్ద కాదని సీఎం జగన్ ముందునుంచీ నమ్మకంతో ఉన్నారని.. అందుకే ఈనెల 16న కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju

ఉత్తమ కథలు