హోమ్ /వార్తలు /రాజకీయం /

మోదీ గెలిస్తే రాహుల్ గాంధీదే బాధ్యత...కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

మోదీ గెలిస్తే రాహుల్ గాంధీదే బాధ్యత...కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

మోదీ, రాహుల్, కేజ్రీవాల్

మోదీ, రాహుల్, కేజ్రీవాల్

ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలించలేదు. దాంతో రెండు పార్టీలు వేర్వేరుగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.

    దేశంలో ఆరోవిడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇవాళే ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీల నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఢిల్లీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీలకు రాహుల్ గాంధీ హాని తలపెడుతున్నారని..నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే..దానికి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలని విరుచుకుపడ్డారు. PTI వార్తా సంస్థతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


    యూపీలో ఎస్సీ-బీఎస్పీ, కేరళలో వామపక్షాలు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమాద్మీ పార్టీకి రాహుల్ గాంధీ హాని తలపెడుతున్నారు. నరేంద్ర మోదీ మరోసారి అధికారపగ్గాలు చేపడితే దానికి రాహుల్ గాంధీదే బాధ్యత. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడటం లేదు. విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
    అరవింద్ కేజ్రీవాల్
    అటు ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. దేశానికి ఆయన చేసిందేమీ లేదని..ఆయనది నకిలీ జాతీయవాదమని చురకలంటించారు. దేశానికి మోదీ జాతీయవాదంతో ముప్పు పొంచి ఉందని విమర్శించారు. దేశానికి తాను ఏం చేశారో చెప్పుకోలేక.. జవాన్ల పేరుతో ఓట్లు అభ్యర్థిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్.


    కాగా, ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలించలేదు. దాంతో రెండు పార్టీలు వేర్వేరుగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి. తమ పొత్తు ఏర్పడపోవడానికి కారణం రాహుల్ గాంధీయే కారణమంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలను తీవ్రతరం చేశారు కేజ్రీవాల్.

    First published:

    Tags: AAP, Arvind Kejriwal, Bjp, Congress, Delhi, Delhi Lok Sabha Elections 2019, New Delhi, Pm modi, Rahul Gandhi

    ఉత్తమ కథలు