బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి తమ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకుని ఇక ఇంటికి రావాల్సిందిగా కోరారు. లాలూ - రబ్రీదేవిల కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఇంట్లో అలిగి వెళ్లిపోయారు. తన భార్య ఐశ్యర్యరాయ్తో విడాకులు కావాలని కుటుంబాన్ని కోరారు. దాణా కుంభకోణంలో శిక్షపడిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను రాంచీ ఆస్పత్రిలో కలిసిన తర్వాత నుంచి తేజ్ ప్రతాప్ ఇంటికి రావడం మానేశారు. అప్పుడప్పుడు మీడియాలో కనిపించినా ఇంటికి మాత్రం వెళ్లడం లేదు. ఇప్పుడు పాట్నాలోనే వేరే ఇంట్లో ఉంటున్నారు. దీంతో తల్లడిల్లిన తల్లి రబ్రీదేవి ఇక జరిగింది చాలని ఇంటికి రావాలని కొడుకుని కోరింది.
తమ ఇద్దరు కుమారుల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని రబ్రీదేవి ఆరోపించారు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మధ్య లేనిపోని గొడవలు సృష్టించేందుకు జేడీయూ, బీజేపీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Lalu Prasad Yadav