గత రెండు రోజులుగా ఉత్కంఠకు దారితీసిన పంజాబ్ (Punjab) రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే చరణ్జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) ఎంపికయ్యారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటల్లోనే చరంజీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి (chief minister)గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం చరణ్జీత్ సింగ్ చన్నీకి సమాచారం ఇవ్వడం.. ఆయన గవర్నర్ను ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరడానికి అపాయింట్మెంట్ అడగడం చకచకా జరిగిపోయాయి. కాగా, సీఎం రేసులో పీసీపీ చీఫ్ నవ్యజోత్ సింగ్ సిద్దూ రేసులో ముందున్నా.. ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం.. కెప్టెన్ అమరీందర్ ఆయనకు వ్యతిరేకంగా ఉండటం కలిసిరాలేదు. దీంతో అధిష్టానం (high command) చరణ్జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi ) వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావుత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021
చరణ్జీత్ సింగ్ గురించి కొన్ని విషయాలు..
చరణ్జీత్ సింగ్ చన్నీ. పంజాబ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ & ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మంత్రిగా పనిచేశారు. చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 నుంచి 2016 వరకు పంజాబ్ విధాన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చరణ్జీత్ సింగ్ రామదాసియా సిక్కు వర్గానికి చెందిన దళిత వ్యక్తి. 47 సంవత్సరాల వయస్సులో పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా నియమితులయ్యారు. అయితే సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్జీత్ సింగ్ ముఖ్యమంత్రి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
కాగా, కొత్త సీఎం చరణ్జీత్ సింగ్కు మాజీ సీఎం అమరీందర్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సరిహద్దు రాష్ట్రం నుంచి పంజాబ్ని సురక్షితంగా ఉంచుతూ , సరిహద్దుల నుంచి పెరుగుతున్న భద్రతా ముప్పు నుంచి ప్రజలను కాపాడగలరని నేను ఆశిస్తున్నాను”అని తెలిపారు.
‘My best wishes to Charanjit Singh Channi. I hope he’s able to keep the border state of Punjab safe and protect our people from the growing security threat from across the border’: @capt_amarinder pic.twitter.com/oO2F6JUZ6J
— Raveen Thukral (@RT_Media_Capt) September 19, 2021
చరణ్జీత్ సింగ్పై మీటూ కేసు ఉంది : బీజేపీ
కాగా, చరణ్జీత్ సింగ్ను పంజాబ్కు కొత్త సీఎంగా ప్రకటించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయనపై ఇదివరకే మీటూ కేసు ఉన్నట్లు గుర్తుచేసింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా దీనిపై ఓ ట్విట్ చేశారు.
Congress’s CM pick Charanjit Channi faces action in a 3-year-old #MeToo case. He had allegedly sent an inappropriate text to a woman IAS officer in 2018. It was covered up but the case resurfaced when Punjab Women's Commission sent notice.
Well done, Rahul.https://t.co/5OV70lwjWT
— Amit Malviya (@amitmalviya) September 19, 2021
‘‘ కాంగ్రెస్ కొత్త సీఎంగా ఎన్నికైన చరణ్జీత్ సింగ్ చన్నీ 3 సంవత్సరాల క్రితం #MeToo కేసులో చర్యను ఎదుర్కొన్నారు. అతను 2018 లో ఒక మహిళా IAS అధికారికి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని కప్పిపుచ్చారు. కానీ పంజాబ్ మహిళా కమిషన్ నోటీసు పంపడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బాగా చేశారు, రాహుల్.” అని తన పోస్టులో రాసుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.