హోమ్ /వార్తలు /రాజకీయం /

ప్రధాని మోదీ విశాఖ టూర్.. ఫైళ్లు తెరుస్తారని చంద్రబాబుకు భయం.. సీఎం పేరెత్తకుండా పంచ్‌లు..

ప్రధాని మోదీ విశాఖ టూర్.. ఫైళ్లు తెరుస్తారని చంద్రబాబుకు భయం.. సీఎం పేరెత్తకుండా పంచ్‌లు..

తమిళనాడు పర్యటనలో నరేంద్ర మోదీ (ANI)

తమిళనాడు పర్యటనలో నరేంద్ర మోదీ (ANI)

ఏపీలో వారి కుటుంబ పాలనను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఫైళ్లు తెరుస్తారని కొందరు భయపడుతున్నారని మోదీ విమర్శించారు.

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు ఎత్తకుండా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఇక్కడున్న నేతలు యూ టర్న్ తీసుకోవడంలో గొప్పోళ్లు. ఇప్పుడు తెలుగువారికి ద్రోహం చేసిన వారితో చేతులు కలిపారు. ఏపీకి వాళ్లు ఏం చేస్తారు? దేశానికి వారి ఎజెండా ఏంటో చెప్పలేదు. వారి లక్ష్యం మోదీని దించడమే.’ అని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు పగలూ రాత్రి బీజేపీపై అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజల పిల్లలను ముందుకు తీసుకెళ్లాల్సిన వారు.. సొంత పిల్లలను ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టిపెట్టారని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు.


    Naranedra Modi Visakha Tour, Modi Visakha Tour, PM Modi Visakha tour, Modi Tour in Visakha, Visakhapatnam, BJP Meeting, BJP Visakha meeting, Modi meeting in Visakha, Modi meeting in Visakhapatnam, నరేంద్ర మోదీ విశాఖ టూర్, మోదీ విశాఖ టూర్, మోదీ విశాఖ పర్యటన, విశాఖలో మోదీ టూర్, విశాఖపట్నం, బీజేపీ మీటింగ్, బీజేపీ విశాఖ సభ, మోదీ విశాఖ సభ, విశాఖలో మోదీ సభ
    విశాఖ బీజేపీ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ (ANI)


    తమకు ఎలాంటి భయం లేదని మోదీ అన్నారు. పాపం చేసిన వాళ్లే భయపడతారన్నారు. రాష్ట్రంలో వారి కుటుంబ పాలనను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఫైళ్లు తెరుస్తారని కొందరు భయపడుతున్నారని మోదీ విమర్శించారు. దేశం మొత్తం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినదిస్తుంటే, మహాకూటమి నేతలు మాత్రం సైన్యం మనో ధైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. వారి మాటలను ఏకంగా పాకిస్థాన్ పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించారన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు.


    Naranedra Modi Visakha Tour, Modi Visakha Tour, PM Modi Visakha tour, Modi Tour in Visakha, Visakhapatnam, BJP Meeting, BJP Visakha meeting, Modi meeting in Visakha, Modi meeting in Visakhapatnam, నరేంద్ర మోదీ విశాఖ టూర్, మోదీ విశాఖ టూర్, మోదీ విశాఖ పర్యటన, విశాఖలో మోదీ టూర్, విశాఖపట్నం, బీజేపీ మీటింగ్, బీజేపీ విశాఖ సభ, మోదీ విశాఖ సభ, విశాఖలో మోదీ సభ
    ధర్మపోరాట దీక్షలో రాహుల్, చంద్రబాబు


    ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల అయిన విశాఖ రైల్వేజోన్‌ను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశామన్నారు. విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని స్మార్ట్ నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.

    First published:

    Tags: Bjp, Chandrababu naidu, Mahakutami, Pm modi, Tdp

    ఉత్తమ కథలు