news18-telugu
Updated: December 4, 2019, 9:50 PM IST
Video : తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కొంతకాలంగా జైల్లో ఉన్న చిదంబరం ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కుమారుడు కార్తీ చిదంబరం, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక గురువారం ఉదయం 11 గంటలకు చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కార్తీ చిదంబరం వెల్లడించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం తీహర్ జైలులో 106 రోజులు ఉన్నారు.
మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో 105 రోజుల తర్వాత చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంలో దాన్ని సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్.భానుమతి నేత్రుత్వంలోని ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్ లభించినట్టయింది.
Published by:
Shiva Kumar Addula
First published:
December 4, 2019, 9:39 PM IST