ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎమ్మెల్యేల ప్రాణాలే కాదని, పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులకు కుదించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఏపీ ఎమ్మెల్యేల ప్రాణాలే కాదు. పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా ముఖ్యమే. కరోనా వల్ల ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులే నిర్వహిస్తుంది. కానీ, పదో తరగతి పరీక్షలు మాత్రం పూర్తిగా నిర్వహిస్తామని చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఉంది. వాళ్లకు తెలుసు పదో తరగతి విద్యార్థులకు ఓటు హక్కు లేదని.’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 11 పేపర్ల స్థానంలో ఆరు పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించనుంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు అయిన తర్వాత ఏపీలో కూడా రద్దు చేస్తారేమోననే ప్రచారం రావడంతో అలాంటిదేమీ లేదని, షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
#10thstudents_livesmatter
Not just -AP MLAs
—————————————
YCP led AP Govt reduces Assembly session to 2 days citing Corona but declares safe to conduct 10th exams.The govt is clever; they know 10th students do not have voting rights.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.