news18-telugu
Updated: January 5, 2020, 4:20 PM IST
నాగబాబు (Nagababu)
ఏపీ రాజకీయాలపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు తాజాగా ట్వీట్ చేశారు. 'ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో తెలియదు కానీ... నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిపై జరుగుతోన్న గందరగోళంపై స్పందిస్తూ ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ అభిమాని ఒకరు స్పందిస్తూ... 'వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కల్యాణ్.. అంతేగా? నాగబాబు గారూ అంటూ సెటైర్ వేశాడు. మరొకరు ఏపీలో 'ఇద్దరు మనుషులే కాదు.. రెండు మాఫియాలు ఉన్నాయి.. వారికి అనైతిక మీడియా మద్దతు తెలుపుతోంది' అని కామెంట్ చేశారు. నాగబాబు కామెంట్ 'అదిరింది' అంటూ మరికొందరు రిప్లై ఇచ్చారు. జబర్దస్త్ నుంచి బయటకొచ్చిన నాగబాబు.. ‘అదిరింది' అనే కామెడీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ‘మీరేం బాధపడకండి సర్.. ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటున్నారు.. మీరు అప్పుడప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారంతే!' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తం మీద నాగబాబు ట్వీట్ పై నెటిజన్స్ మాత్రం తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. కొందరు అనుకూలంగా ఉండే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 5, 2020, 2:36 PM IST