పంజాబ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తన కేబినెట్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తాను మంత్రివర్గ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని కూడా ట్వీట్ చేశారు సిద్ధు. ఈనెల 10వ తేదీనే ఆయన పదవకి రాజీనమా చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి... తన రాజీనామాల లేఖను కూడా సమర్పించినట్లు తెలిపారు. అయితే సిద్ధు రాజీనామాకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు.
గతకొన్ని రోజులుగా సిద్ధుకు... పంజాబ సీఎం అమరీందర్ సింగ్ మధ్య సఖ్యత లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధు మంత్రిపదవికి రాజీనామా చేశాడని కొందరు చర్చించకుంటున్నారు.
My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl
— Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019
Met the congress President, handed him my letter, appraised him of the situation ! pic.twitter.com/ZcLW0rr8r3
— Navjot Singh Sidhu (@sherryontopp) June 10, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.