వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, ఈ క్రమంలో పెద్దాయన చెంప కూడా చెళ్లుమందని చెప్పారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ కదలదు. చిన్నబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ బతకదు. ఇది ప్రధానమైన సమస్య. చంద్రముఖిగా మారిన చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న. లాక్ డౌన్ లో ఉన్న చంద్రబాబును చూసి నాకు నిజంగా నవ్వాల్నో, ఏడవాల్నో అర్థంకావడం లేదు. అధికారం పొగొట్టుకున్నాడు. చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు మండలి కాస్తా రద్దు కాబోతోంది. ఇప్పుడు కొడుకు పరిస్ధితి ఏంటి. అది పెద్ద సందిగ్దమైన ప్రశ్న. కుటుంబపరిస్ధితి ఎలా ఉందంటే... నా కుమారుడు పరిస్థితి ఏందని ఒకరడిగితే, నాభర్త పరిస్ధితి ఏందని ఇంకొకరడిగితే... ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక చంద్రబాబునాయుడు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నాడు. పప్పు పరిస్దితి ఇప్పుడుగాని చూస్తే ఎంఎల్ ఏ కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు. ఎమ్మెల్సీ పదవి పోతుంది.ఈ పరిస్ధితులలో అయ్యా కొడుకులిద్దరూ కూడా చాలా కుటంబసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ముదిరి పెద్దాయన చెంప చెళ్లుమన్నది. ఏంటనేది మీరు అర్ధం చేసుకుంటారనుకుంటా.’ అని విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి ఆలోచనే లేదు...తనను వణికిస్తున్న కుటుంబసమస్యలే ఆయనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. అందుకే ఇవేమి బయటపడకుండా తాను బాగున్నానని చెప్పుకుని రోజూ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.