హోమ్ /వార్తలు /politics /

కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా.. మంత్రులపై లోకేష్ ఫైర్

కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా.. మంత్రులపై లోకేష్ ఫైర్

ఆకలి బాధతో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రులకు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఆకలి బాధతో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రులకు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఆకలి బాధతో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రులకు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

    ఏపీలో ఇసుక కొరతపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇసుక కొరతపై ఇప్పటికే నారా లోకేష్ ఒక రోజు దీక్ష చేశారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇసుక కొరతతో పని లేకపోవడంతో పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఇసుక కొరత చుట్టూనే తిరుగుతున్నాయి. ఇసుక సరఫరా చేయలేని ప్రభుత్వం.. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యకు కారణమవుతోందంటూ మండిపడుతున్నాయి విపక్షాలు.

    భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఇప్పడు రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రభుత్వం చేతగాని తనం వల్లే.. కార్మికులు చనిపోతున్నారని టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. ఐతే వేర్వేరు కారణాలతో చనిపోయిన వారిని కూడా భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఏపీ మంత్రులు విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రుల తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకలి బాధతో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రులకు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనికి నేతల అక్రమ ఇసుక దందా, తుగ్లక్ నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.

    First published:

    ఉత్తమ కథలు