ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా మోటార్స్ పరిశ్రమ రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చొరవే కారణమని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. “కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, వైఎస్ జగన్ గారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా ? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు” అంటూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, @ysjaganగారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు.
అంతకుముందు ఏపీలో కియా పరిశ్రమ రావడానికి చంద్రబాబు కంటే ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ చూపించారన్న మంత్రి బుగ్గన... ఈ మేరకు కంపెనీకి చెందిన కీలక అధికారి రాసిన లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని... అసలు ప్రభుత్వం పనితీరుకు అది కొలమానం కాదని బుగ్గన విమర్శించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.