భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
జగన్, కేసీఆర్లతో పొత్తులపై మోదీ పరోక్ష సమాధానం ఇచ్చారనే చెప్పాలి. ఓవైపు సొంతంగా అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూనే.. అవసరమైతే ఒక్క ఎంపీని అందించే పార్టీ సహకారాన్నైనా తీసుకుంటాం చెప్పారు. ఈ లెక్కన ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీకి పూర్తి అధికారం రాకపోతే.. ఇతర పార్టీలతో పొత్తుకు మోదీ తలుపులు తెరిచే ఉంచారని అనుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, CM KCR, Lok Sabha Election 2019, Narendra modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Ys jagan, Ys jagan mohan reddy