news18-telugu
Updated: October 24, 2019, 10:21 AM IST
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి జోరు కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో ఆ రెండు పార్టీల జోరు కొనసాగింది. బీజేపీ 92, శివసేన 53 నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ 38, ఎన్సీపీ 47 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 288 సీట్లున్న మహారాష్ట్రలో మేజిక్ మార్క్ 145. బీజేపీ, శివసేన రెండు పార్టీల బలం కలిపి 145కి చేరింది. దీంతో మేజిక్ మార్క్ దాటింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటేమెరుగు పడింది. బీజేపీ, శివసేన పార్టీలకు సీట్లు గతంలో కంటే తగ్గాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 24, 2019, 10:14 AM IST