హస్తినలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతోందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతుండడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఉత్సాహం ఉరకలెత్తుతోంది. బీజేపీ కార్యకర్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ క్రమంలో మే 23న ఫలితాలు ప్రకటించడానికి ముందే ఓ సారి సమావేశం కావాలని నిర్ణయించారు. మే 21న ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం జరగనుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈ భేటీకి హాజరుకానున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈనెల 22న ఎన్నికలపై పార్టీలో అంతర్గతంగా చర్చించనుంది. అదే సమయంలో మే 23న ఫలితాలు ప్రకటించే రోజున యూపీఏ పక్షాలు, యూపీఏతో కలసివచ్చే పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. ఆ భేటీకి సమన్వయం చేస్తూ చంద్రబాబు గత రెండు రోజులుగా ఉత్తరాదిలో వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.