news18-telugu
Updated: November 17, 2019, 4:05 PM IST
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కేంద్రానికి అలాంటి ఆలోచన ఏదీ లేకపోతే... ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేసే అంశం కేంద్రం పరిశీలనలో లేదని ఆయన తెలిపారు. 370 రద్దుతో కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత సమావేశాల్లో పార్లమెంట్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని ఆయన ప్రకటించారు.
ప్రతిపక్షలు ఏ అంశంపై ప్రతిపాదన పెట్టినా చర్చించేందుకు తాము సిద్దమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. విద్యావిధానం, వైద్య విధానం, నదుల అనుసంధానంపై చర్చ జరుపుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం,విద్య వంటి మౌళిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయమని వెల్లడించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేశామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 17, 2019, 4:05 PM IST