ఏపీ ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్కు గురి చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ ట్యాంపరింగ్కు గురి అయ్యాయని ఆరోపించారు. అంతేకాదు ప్రజశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్కు ఓటేస్తే... అది కాస్త వైసీపీ గుర్తు ఫ్యాన్కు పడిందన్నారు కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్పై స్పందిస్తూ ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయిందన్నారు కేఏ పాల్ పేర్కొన్నారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్కడ హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు కేఏ పాల్. అంతేకాదు 70 నుంచి 80 శాతం ఓట్లు తమ ప్రజా శాంతి పార్టీకే పడ్డాయని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు కేఏ పాల్.
ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతా అన్నారు. అయితే ఇప్పుడు ఈసీలో ఓ కమిషనర్ అశోక్ లావాసాకు సీఈసీ అరోరాతో అభిప్రాయభేదాలు ఉన్నాయిని కూడా పాల్ ఆరోపించారు. కాబట్టి అది సాధ్యం కావటం లేదని పాల్ చెప్పారు. దీంతో ఏపీలో ఎన్నికలు రీ కాల్ చెయ్యాలని సుప్రీం కోర్టుకు వెళతానన్నారు పాల్. అంతేకాదు ఏపీలో ప్రజా శాంతి పార్టీకి 30 సీట్లు రావడం పక్కా అన్నారు పాల్. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయి' అని చెప్పారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Ka paul