టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు 'కారు'లో సవరణలు చేయాలంటూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన సూచనలను ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఇకనుంచి ఎన్నికల్లో కారు గుర్తును 'బోల్డ్' చేయాలని కోరుతూ.. సవరణలు చేసిన గుర్తును ఈసీకి వినోద్ శుక్రవారం సమర్పించారు. గుర్తును బోల్డ్ చేయడం ద్వారా మరింత స్పష్టంగా కనిపిస్తుందని వినోద్ ఈసీకి సూచించారు. వినోద్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న ఈసీ దాన్ని పరిశీలించనుంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కారు గుర్తు సరిగా కనిపించక.. వృద్దులు, కొంతమంది ఓటర్లు అయోమయానికి గురయ్యారని డిసెంబర్ 27న ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై కారు గుర్తు స్పష్టంగా కనిపించకపోవడం.. అదే గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తు, ఇస్త్రీ పెట్టె గుర్తులతో ఓటర్లు గందరగోళపడటం గురించి ఆయన ఈసీకి వివరించారు. ఈ నేపథ్యంలోనే గుర్తులో సవరణలు చేయాల్సిందిగా కోరారు.
(సవరణలు చేసి ఈసీకి ఎంపీ వినోద్ సమర్పించిన కారు గుర్తు..)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana Election 2018, Trs