హోమ్ /వార్తలు /రాజకీయం /

జగన్ మార్క్ దోపిడీ... వైసీపీ నేతలు దరువెయ్యండి: నారా లోకేష్

జగన్ మార్క్ దోపిడీ... వైసీపీ నేతలు దరువెయ్యండి: నారా లోకేష్

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

విద్యుత్ బిల్లుల పేరిట ఏపీలో కొత్త దోపిడీ ప్రారంభమైందని నారా లోకేష్ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు. విద్యుత్ బిల్లుల పేరిట ఏపీలో కొత్త దోపిడీ ప్రారంభమైందని మండిపడ్డారు. ‘బాదుడే... బాదుడు... వైఎస్ జగన్ మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 40 రోజుల లాక్ డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తొలిరోజు 25 శాతం మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత మరో 50 శాతం పెంచింది. మొత్తం 75 శాతం మేర మద్యం ధరలు పెరిగాయి. అయితే, మద్యం ధరలను విపరీతంగా పెంచడం ద్వారా ప్రజల్లో మద్య పాన నిషేధాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వైసీపీ నేతలు వాదిస్తున్నారు. లాక్ డౌన్‌లో మూసి ఉన్న మద్యం దుకాణాలను తెరిచి, ధరలు పెంచిని ప్రభుత్వం, మళ్లీ మద్యపాన నిషేధం అంటుండడంపై విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే లోకేష్ ఇలా సెటైర్లు వేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Liquor sales, Liquor shops, Nara Lokesh

ఉత్తమ కథలు