ఏపీలో రైతు రుణమాఫీ పథకం రద్దు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
news18-telugu
Updated: September 25, 2019, 1:43 PM IST

వైఎస్ జగన్...
- News18 Telugu
- Last Updated: September 25, 2019, 1:43 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు చెల్లింపులకు సంబంధించి జీవో నెంబరు 38 గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది జగన్ సర్కార్. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... రేపట్నుంచే అమల్లోకి...
పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...
వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం
Loading...