కాంగ్రెస్ పార్టీ పాలన మీద ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి యాక్సిలేటర్ మీద జోరుగా సాగుతుంటే, అభివృద్ధి వెంటిలేటర్ మీద ఉండేదన్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతి జంటగా చేతిలో చెయ్యివేసి నడుస్తాయని ఎద్దేవా చేశారు. భద్రతా బలగాలకు రక్షణ కల్పించే AFSPA మీద సమీక్ష చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం ద్వారా సైన్యం మానసిక స్థైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘ముక్కల ముక్కల’ గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్స్ జమ్మూకాశ్మీర్కి ప్రధాని కావాలని కోరుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వారసత్వ రాజకీయాలకు నెలవైన కుటుంబం ఇప్పుడు జైలు నుంచి బయటపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
అంతకు ముందు యూపీలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలు ‘మోదీ హఠావో’ నినాదం ఇచ్చాయని, అయితే.. వారి లక్ష్యం మాత్రం వారసత్వ రాజకీయాలేనని చెప్పారు. కుంభమేళాలో పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగినప్పుడు బీఎస్పీ చీఫ్ మాయావతి తనను హేళన చేసిందని, అదే కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించినప్పుడు మాత్రం నోరెత్తలేదని చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.