ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నవేళ.. ఎట్టకేలకు ఆయన దీనిపై స్పందించారు. నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని చెప్పారు. తాను అర్హుడిని కాదని చెబుతూనే.. నోబెల్కు అర్హులెవరో కూడా చెప్పారు ఇమ్రాన్. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిష్కరించి.. శాంతికి, మానవాభివృద్దికి ఎవరైతే మార్గం సుగమం చేస్తారో.. వారు నోబెల్కు అర్హులని అభిప్రాయపడ్డారు.
ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్తో శాంతి చర్చలకు తాను సిద్దమంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరి నచ్చకనే ఆ దేశంతో చర్చలకు దూరంగా ఉంటోంది.
I am not worthy of the Nobel Peace prize. The person worthy of this would be the one who solves the Kashmir dispute according to the wishes of the Kashmiri people and paves the way for peace & human development in the subcontinent.
— Imran Khan (@ImranKhanPTI) March 4, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir, Narendra modi, Nobel Prize, Pulwama Terror Attack